జబర్దస్త్ షోకి నా వల్ల కూడా హైప్ వచ్చింది!: యాంకర్ అనసూయ వ్యాఖ్యలు

  • టీవీ ప్రోగ్రాంలలో బబర్దస్త్ ఓ చరిత్ర 
  • నేను కూడా హైప్‌ తెచ్చానన్న విషయం లిఖించబడి ఉంటుంది
  • జబర్దస్త్ నుంచి ఇప్పటికే చాలా మంది వెళ్లిపోయారు
  • మల్లెమాల వారు ఎన్నడూ మమ్మల్ని వద్దని చెప్పలేదు
జబర్దస్త్ షోకి తన వల్ల కూడా హైప్ వచ్చిందని యాంకర్ అనసూయ చెప్పింది. తాజాగా ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడుతూ.. టీవీ ప్రోగ్రాంలలో బబర్దస్త్ ఓ చరిత్ర సృష్టించిందని తెలిపింది. గతంలో ఆ షో నుంచి తాను వెళ్లాక, రష్మీ యాంకర్‌గా వచ్చిన తర్వాత కూడా ఆ షో నడిచిందని, ఆ షోకి తాను కూడా హైప్‌ తెచ్చానన్న విషయం లిఖించబడి ఉండే విషయమని వ్యాఖ్యానించింది.

జబర్దస్త్ నుంచి ఇప్పటికే చాలా మంది వెళ్లిపోయారని అనసూయ తెలిపింది. 'ఇప్పుడు బాబు గారు లేరు. అది ఆయన తీసుకున్న నిర్ణయం. మేము వద్దని వెళ్లిపోవడమే తప్ప మల్లెమాల వారు ఎన్నడూ మమ్మల్ని వద్దని చెప్పలేదు' అని ఆమె చెప్పింది. జబర్దస్త్‌కు సంబంధించి కొన్ని షోల్లో తాను కనపడలేదని, సినిమా షూటింగుల్లో బిజీగా ఉండడం వల్లే తాను చేయలేకపోయానని తెలిపింది.

Jabardasth
anasuya

More Telugu News